Monday, May 6, 2024

నవంబర్‌లో టెక్నికల్‌ ఫెస్ట్‌.. వెల్ల‌డించిన విద్యాశాఖ‌

అమరావతి, ఆంధ్రప్రభ: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా ప్రోత్సహించేందుకు 2022-23కు సంబంధించి నవంబర్‌లో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ల్లోని విద్యార్థులకు టెక్నికల్‌ ఫెస్ట్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల శాస్త్రీయ ఆలోచనలకు, వినూత్న స్ఫూర్తికి ఈ టెక్నికల్‌ ఫెస్ట్‌ వేదికగా ఉపయోగపడుతోందన్నారు. టెక్‌ ఫెస్ట్‌ ను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తామన్నారు.

ఆయా జిల్లాల స్థాయిలో నవంబర్‌ 14 నుంచి 17 వరకు రాష్ట్రస్థాయిలో నవంబర్‌ 24 నుంచి 26 వరకు నిర్వహించేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థుల్ని ఇప్పటి నుంచే ఆ దిశగా తయారుచేసి ప్రోత్సహిచేందుకు పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపక సిబ్బంది, ప్రిన్సిపాల్స్‌కు తగు సూచనలు జారీ చేసినట్లు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement