Wednesday, May 8, 2024

పక్కాగా శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం..

అమరావతి, ఆంధ్రప్రభ : వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం అమలులో భాగంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌తో రాష్ట్ర రెవెన్యూ శాఖ అవగాహాన కుదుర్చుకోగా, గురువారం విజయవాడ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం తరుపున సర్వే సెటిల్మెంట్స్‌ , ల్యాండ్‌ రికార్డ్స్‌ కమీషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జరుగుమిల్లి రామ కృష్ణారావు ఒప్పంద పత్రాలపై ల్యాండ్‌ అడ్మినిస్ట్రేష్రన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయిప్రసాద్‌ సమక్షంలో సంతకాలు చేశారు. ఇంటిగ్రే టెడ్‌ ల్యాండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను రూపొందించటం ద్వారా రాష్ట్రంలో టైటిల్‌ సిస్టమ్‌ యొక్క నిశ్చయాత్మక నమోదు వంటివి సులభతరం అవుతాయని ల్యాండ్‌ అడ్మినిస్ట్రేష్రన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయిప్రసాద్‌ ఈ సందర్భంగా వివరించారు.

పౌరులకు వివాదరహిత భూ యాజమాన్యాన్ని అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ-హక్కు, భూ-రక్షా పథకం’ ప్రారంభించిందన్నారు. ల్యాండ్‌ అడ్మినిస్ట్రేష్రన్‌కు సంబంధించిన ఏవైనా కొత్త సేవలను అందించేందుకు కూడా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వివరించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూమి హద్దులను పున:పరిశీలించడం జరుగుతుందని సర్వే సెటిల్మెంట్స్‌ , ల్యాండ్‌ రికార్డ్స్‌ కమీషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో భూ యాజమాన్యంపై వివాదాలను తొలగించి నిశ్చయాత్మకమైన భూమి టైటిల్‌ సిస్టమ్‌ను అమలు చేయడం ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశంగా ఉంటుదన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం ప్రయోజనాల దృష్ట్యా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ సేవలు సద్వినియోగం కానున్నాయని, ఇంటిగ్రే టెడ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ క్రింద ఉన్న అన్ని సేవలను కవర్‌ చేస్తుందని సిద్దార్థ జైన్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement