Sunday, May 19, 2024

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కు ఏర్పాట్లు సిద్ధం

. ఉయ్యూరు: ఆదివారం జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. స్థానిక పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి నూజివీడు లో శిక్షణ పొందిన పోలింగ్ సిబ్బంది శనివారం చేరుకున్నారు.7గురు సిబ్బంది మెటీరియల్ తో సహా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తాసిల్దార్ నాగేశ్వరరావు రిపోర్టింగ్ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ 186 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని, 96 మంది పురుష ఓటర్లు, 90 మంది మహిళా ఓటర్లు, ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement