Monday, April 29, 2024

Kadapa: ఈనెల 6న అసెంబ్లీ ముట్టడిస్తాం..

కడప – ప్రభ న్యూస్ : సర్పంచులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చులకన భావం ఏర్పడిందని, అందుకే పార్టీలకు అతీతంగా ఈనెల 6వ తేదీన చలో అసెంబ్లీ.. ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ పంచాయతీ రాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షలు మునిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచులు అందరూ జయప్రదం చేయాలని కోరారు.

శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు సర్పంచులు అంటే చిన్నచూపు ఏర్పడిందని, పంచాయతీ రాజ్ వ్యవస్థపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర పద్దుల కింద వాడుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో తెలియజేయాల్సిన అవసరం ఉందని, అందుకే ఈనెల 6వ తేదీన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు చలో అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement