Saturday, May 4, 2024

TS: బ్ర‌హ్మోత్సవాలపై అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం

కరీంనగర్​లోని మార్కెట్ రోడ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈసారి అధికారికంగా నిర్వహిస్తున్నామ‌న్నారు.

స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. మాజీ మంత్రి గంగుల కూడా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానిస్తున్నామ‌న్నారు. ఎంపీ బండి సంజయ్ కూడా ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement