Sunday, April 28, 2024

ADB: ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థుల ర్యాలీ

బోథ్, ఫిబ్రవరి 3 (ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం నాగభూషణం హై స్కూల్ విద్యార్థులు, సబ్ ఇన్​ స్పెక్టర్​ రాముల ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

పట్టణ పురవీదుల గుండా తిరుగుతూ ట్రాఫిక్ రూల్స్ పై స్లొగన్స్ ఇచ్చారు. అనంతరం స్థానిక బస్టాండ్ ప్రాంతంలో విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాము ట్రాఫిక్ రూల్స్ పై రోడ్డు నియమ నిబంధనలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement