Sunday, May 19, 2024

AP: బద్వేలులో రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

కడప ప్రతినిధి, ప్రభ న్యూస్ : కడప జిల్లా బద్వేలు మండలం కొంగలవీడు సమీపంలో ఇవాళ రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు స్కూటర్లు ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు స్కూటర్లలో ఉన్న నలుగురు వ్యక్తులు కింద పడడం జరిగింది. వీరిలో ఇద్దరు వ్యక్తులపై వెనుక నుంచి వస్తున్న లారీ దూసుకెళ్లింది.

ఈ సంఘటనలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు అట్లూరు మండలం గాండ్లపల్లెకు చెందిన రామ్ కుమార్, చిన్న పెంచలయ్యలుగా గుర్తించారు. గాయపడ్డ వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement