Wednesday, May 1, 2024

AP : చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 19కి వాయిదా వాస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ పిటిషన్లపై ఇరువర్గాలు వాదనలు విన్న ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ల‌ పై కౌంటర్ వేసేందుకు మంగళవారం వరకు సమయ‌మిస్తూ, విచారణ ను మంగళవారంకు వాయిదా వేసింది. అంతలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్‌పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement