Tuesday, May 14, 2024

గెలుపోటములకు అతీతంగా ప్రజాసమస్యలపై పోరాటం – టిడిపి ఇన్ ఛార్జ్ ప్రవీణ్

ప్రొద్దుటూరు : గెలుపోటములకు అతీతంగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ డాక్టర్ జి. వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆయన కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు తనను, తమ పార్టీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేసి వారి ఇష్టానుసారముగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి విజయం సాధించారన్నారు. తమ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు, ఓట్లేసిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా గెలుపొందిన కౌన్సిలర్ కు అభినందనలు తెలిపారు. గెలుపోటములకు అతీతంగా ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్దంగా వున్నారని వివరించారు. ఓటమి విజయానికి తొలి మెట్టని, తమ ఓటమికి కారణాలను సమీక్షించుకొని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముక్తియార్, ఇ. వి. సుధాకర్ రెడ్డి, బొర్రా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement