Monday, May 20, 2024

జెడ్పీటీసీ..గ్రామస్తుల వినతి పత్రం

తాండూరు : ఫోర్‌ లైన్‌ రహదారి నిర్మాణం పనుల్లో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్‌ నుండి చౌటపల్లి అంకుశం గ్రామాల చౌరస్తా వరకు సర్వీస్‌ రోడ్డు, సైడ్‌ డ్రైన్‌ను నిర్మించాలని జెడ్‌పీటీసీ సాలిగామ బానయ్య ఆధ్వర్యంలో స్థానికులు జిల్లా పాలనాధికారి కార్యాలయ ఏఓకు, ఎన్‌హెచ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ఫోర్‌లైన్‌ రహదారి నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని, ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌, రైస్‌మిల్లులు, గ్యాస్‌ ఏజెన్సీ, ప్రైమరీ స్కూల్స్‌, అనాథ శరణాలయానికి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. రోడ్డు దాటే సమయంలో ప్రమాధాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, రైల్వే స్టేషన్‌ నుండి బోయపల్లి బోర్డు చౌరస్తా వరకు సర్వీస్‌ రోడ్డు, సైడ్‌ డ్రైన్లు, బస్టాప్‌ను నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భాస్కర్‌గౌడ్‌, స్థానికులు పూసాల ప్రశాంత్‌, రాజేష్‌, సంతోష్‌, లింగన్న, సారయ్య, తిరుపతి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement