Friday, May 10, 2024

మాధారంలో క్రికెట్‌ పోటీలు

తాండూరు : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌లో క్రికెట్‌ టోర్నమెంట్‌ను బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సూరం రవీంధర్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గట్టు మురళీధర్‌రావు, ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎం.డి.ఈసా, ఏఐటీయూసీ నాయకులు భయ్య మొగిలితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement