Saturday, May 4, 2024

క్రికెట్‌ పోటీలు ప్రారంభం

నెన్నెల : పీఎస్‌ఆర్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా నెన్నెల మండల స్థాయి టోర్నీని జోగాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం తిరుపతి, గుండ్ల సోమారం ఎంపీటీసీ దాగం రమేష్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామపంచాయితీలకు చెందిన టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్‌ జనరల్‌ సెక్రటరి గట్టు మల్లేష్‌, మహిళా నాయకురాలు మల్లిక దేవి, ఎంపీటీసీ గొలుసుల శిరీష-మధునయ్య, మాజీ సర్పంచ్‌ సింగతి తిరుపతి, యూత్‌ అధ్యక్షుడు లావుడ్య రమేష్‌, సహకార సంఘం డైరెక్టర్‌ ఉయ్యాల లింగయ్య, ఓబీసీ అధ్యక్షుడు వెంకటేష్‌, ఓబీసీ నాయకులు రాజన్న, బీష్మా, నరేష్‌, రామ్‌, మల్లేష్‌, శశి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement