Saturday, April 27, 2024

నరసన్నపల్లి ఎంపీపీ పాఠశాల విద్యా కమిటీ ఎన్నిక

బ్రహ్మంగారిమఠం : మండలంలోని నరసన్న పల్లె మండల ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించినట్లు ఎంఈఓ పుల్లయ్య తెలిపారు. మంగళవారం ఎంపీపీ పాఠశాల నందు జడ్పీ బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయ కుమారి అధ్యక్షతన పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ పేరెంట్స్ కమిటీ లో ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ ఎస్. రామయ్య పాల్గొన్నారు. ఇందులో విద్యా కమిటీ చైర్మన్ గా సోమిరెడ్డిపల్లె పెద్ద ఓబయ్య, వైస్ చైర్మన్ గా దబ్బ గుండ్ల సుబ్బరాయుడు లను ఎన్నుకోవడం జరిగింది. సుమారు 18 నెలల పాటు వాయిదా పడుతూ వచ్చిన ఈ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు నూతన సర్పంచ్ సోమిరెడ్డిపల్లె రామయ్య ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి నాయకులు సోమిరెడ్డిపల్లె చలపతి, బండి సుబ్బయ్య, దబ్బ గుంట్ల సుబ్బయ్య, గురుమూర్తి, ఆంజనేయులు, సుబ్బరాజ,చెండ్రాయుడు, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement