Tuesday, May 14, 2024

ప్రొద్దుటూరు అభివృద్ధి కి కృషి చేస్తా – ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు పట్టణాన్ని మున్సిపల్ ఎన్నికలకు ముందు తాను చెప్పిన విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు ముందు తాను ప్రొద్దుటూరు లో 41 వార్డులు వైసిపి అభ్యర్థులను గెలిపిస్తే పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తానని, తాను చెప్పిన మాట ప్రకారం ప్రజలు 40 వార్డులలో గెలిపించారని అన్నారు. తాను చెప్పిన ప్రకారము త్రాగు నీటి సమస్య , దోమల నివారణ, 5 కాలువల ఆధునీకరణ, నూతన కూరగాయల నిర్మాణం, నూతన బస్టాండ్ ఆధునీకరణ చేస్తామని అన్నారు. పట్టణంలోని ఇత‌ర‌ సమస్యలను పరిష్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కోనేటి సునంద, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement