Sunday, April 28, 2024

Breaking: ఏపీ సీఎం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్ రెడ్డి.. టీటీడీ ఇన్‌చార్జి ఈవోగా ధ‌ర్మారెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొంద‌రు ఐఏఎస్ అధికారుల‌ పోస్టుల్లో మార్పులు చేస్తూ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవోగా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డిని ఆ బాధ్య‌త‌ల నుంచి రిలీవ్ చేసింది ప్ర‌భుత్వం. టీటీడీ అద‌న‌పు ఈవోగా ఉన్న ధ‌ర్మారెడ్డిని ఇన్‌చార్జి ఈవోగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులిచ్చింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ టీటీడీ ఈవోగా కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌వ‌హ‌ర్ రెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌వి ల‌భించింది. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్ రెడ్డి నియ‌మితుల‌య్యారు.

ఇక‌… నైపుణ్యాభివృద్ధి కార్పొరేష‌న్ ఎండీగా స‌త్య‌నారాయ‌ణ నియ‌మితులు కాగా.. యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ క‌మిష‌న‌ర్‌గా శార‌దా దేవిని నియ‌మిస్తూ ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మైనార్టీ శాఖ సంక్షేమ కార్య‌ద‌ర్శిగా సెర్ప్ ఈవోగా ఉన్న ఇంతియాజ్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement