Thursday, May 2, 2024

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి.. మచిలీపట్నం వద్ద ఘటన

పమిడిముక్కల: మచిలీపట్నం -విజయవాడ జాతీయ రహదారిపై ఇవ్వాల (సోమవారం) కారు యాక్సిడెంట్​ జరిగింది. ఈ ప్రమాదం భార్యాభర్తలు చనిపోయారు. కేసిపి ఫ్లైఓవర్ దగ్గర కారు డివైడర్ ను ఢీకొన్న ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న భార్యా భర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే భర్త మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన మృతుడి భార్యను విజయవాడ జీజీహెచ్ కు తరలించారు. ట్రీట్​మెంట్​ జరుగుతుండగానే ఆమె కూడా చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు పమిడిముక్కల ఎస్ ఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement