Wednesday, May 8, 2024

CBN : ఇవాళ చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు విచారణ

ఇవాళ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి.కాగా స్కిల్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ వేశారు.

దీనిపై వాదనలు జరిగాయి. అయితే తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచింది. దీపావళి సెలవులు తరువాత తీర్పు ఇస్తామని వెల్లడించింది. కాగా ఫైబర్ నెట్ కేసులో ఏడుగురు నిందితుల ఆస్తుల జప్తుపై ఇవాళ‌ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement