Wednesday, May 1, 2024

Vijayawada – కమలహాసన్ చేతుల మీదుగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో)ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని నగరంలో అట్టహాసంగా ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని సినీ నటుడు కమలహాసన్ చేతులమీదుగా ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ తో కలిసి కమల్ హాసన్ ఆవిష్కరించారు.

. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ కృష్ణగా అభివర్ణించారు. అయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో,ఇటు సేవ కార్యక్రమాలూ లో ముందుంటు కృష్ణ పేరు నిలబెడుతున్నారన్నారు. ఎప్పుడు షూటింగ్ లలో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం సంతోషంగా ఉందన్నారు.

నగర ప్రజల తరపున,,కృష్ణ ..మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యుల తరపున సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement