Wednesday, May 8, 2024

GVL: వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను దోచుకుని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా సీఎం జగన్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కేంద్రం ఎన్నో పథకాలకు గ్రాంట్ల రూపంలో నిధులు ఇస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం వాటిని సరిగా సద్వినియోగం చేసుకోవడంలేదని మండిపడ్డారు. వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభుత్వం అనేలా తయారైందని వ్యాఖ్యానించారు.

దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంద్రప్రదేశ్‌కే కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చిందన్నారు. ఓటీఎస్ పేరుతో జగన్ ప్రభుత్వం కొత్త తరహా దోపిడికి పాల్పడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. కేంద్ర పథకాలను కూడా తన సొంత పథకాలుగా చెప్పుకుంటూ స్టిక్కర్లు వేసుకుని జగన్ తన పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈనెల 28న వియవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించ‌నున్న‌ట్లు జీవీఎల్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement