Monday, April 29, 2024

ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక….

గుంటూరు – ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రావులపాలెం సెంటర్ లోని ఒక ఫైనాన్స్ దుకాణం ముందు ఒక యువకుడు మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిఐ వి.కృష్ణ, ఎస్సై పి.బుజ్జిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన చింతపల్లి రాఘవేంద్ర (28) గా గుర్తించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర గుంటూరులోని ఫైనాన్షియర్ల వద్ద అప్పు తీసుకుని జెసిబి కొన్నాడు. అక్కడే పనులు చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ సమయంలో పనులు లేక వాయిదాలు చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు బంధించి వేధింపులకు గురి చేసారు. ఇటీవల ఈ వేధింపులు తీవ్రం కావడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బుజ్జిబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement