Thursday, May 16, 2024

నోటీసులు జారీ చేసే ప‌రిధి ప్రివిలేజ్ క‌మిటీ లేదు – నిమ్మ‌గ‌డ్డ ఘాటు స‌మాధానం….

అమ‌రావ‌తి – మంత్రుల‌పై ఆరోప‌ణ చేశార‌న్న దానిపై వివ‌ర‌ణ కోరుతూ శాస‌న‌స‌భ హ‌క్కుల క‌మిటీ ఇచ్చిన నోటీస్ పై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఘాటుగా స్పందించారు..త‌న‌కు నోటీసులు జారీ చేసే ప‌రిధి ప్రివిలేజ్ క‌మిటీకి లేద‌ని తేల్చేశారు.. ఈ మేర‌కు ఆయ‌న శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శికి లేఖ రాశారు..రాజ్యాంగ స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌కు క‌మిష‌న‌ర్ గా ఉన్న త‌న‌కు ఏ ప్రాతిప‌దిక‌న నోటీసులు జారీ చేస్తార‌ని ప్ర‌శ్నించారు.. త‌న ఆరోప‌ణ‌ల‌కు రుజువులున్నాయా అంటూ ప్రివిలేజ్ క‌మిటీని నిల‌దీశారు.. ప్ర‌స్తుతం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాన‌ని, హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు ప్ర‌యాణం చేసే స్థితిలో తాను లేన‌ని అంటూ, తాను ప్రివిలేజ్ క‌మిటీ ముందు స‌మాధానం చెప్పేందుకు రాలేన‌ని ఆ లేఖ‌లో నిమ్మ‌గ‌డ్డ పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement