Sunday, May 19, 2024

రామలింగారెడ్డి దంపతులకి సన్మానం..

పేట్‌బషీరాబాద్‌ : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్‌ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ మేధిని రామలింగారెడ్డి ఉద్యోగ విరమణ సందర్బంగా ఏర్పాటు చేసిన విడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి నిబద్దతకు మారుపేరు రామలింగారెడ్డి అని, ప్రతి ఉద్యోగికి పదవి విరణ తప్పనిసరని అని అన్నారు. 23 ఏళ్లుగా విద్యాపరంగా రామలింగారెడ్డి ఎన్నో సేవలు అందించాలని ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో యువ టీఆర్‌ఎస్‌ నాయకులు కేపీ.విశాల్‌గౌడ్‌ పాల్గొని రామలింగారెడ్డి దంపతులను శాలువతో ఘనంగా సన్మానించి ఆయన సేవలను కోనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయుల ఖాజాపాషా, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, రామ్మోహన్‌రెడ్డి, విజయరాణి, దానయ్య, గోపాల్‌, శ్రీనివాస్‌, స్థానిక వార్డు సభ్యులు ఇందిరరెడ్డి, నాగ శేఖర్‌గౌడ్‌, పెద్ది మల్లేషం, యేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement