Sunday, May 5, 2024

ఈద్గాలో సామూహిక ప్రార్థన రద్దు.

తెనాలి – :పవిత్ర రంజాన్ సందర్భంగా నిర్వహించే ప్రార్థనలు కరోన కారణంగా రద్దు చేసినట్లు తెనాలి ఈద్గాహ్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ తెలిపారు. బుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు రంజాన్ పర్వదినాన సామూహిక ప్రార్థనలు నిర్వహించడం లేదని తెలిపారు. ముస్లిం సోదరులు ప్రార్ధనలను ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు.కోవిడ్ కారణంగా అనేక మంది మృతి చెందడం బాధాకరమని వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. పలువురు ఈద్గాహ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement