వరికుంటపాడు :- వరికుంటపాడు మండల పరిధిలోని 24 గ్రామపంచాయతీలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్ఐ శ్రీనివాసరావు సూచించారు . నేటి ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు కరోనా రెండవ దశ తీవ్రంగా ఉందని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ లను ధరించాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఎండలో నుంచి ప్రజలు బయటికి రాకూడదని కోరారు. వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ తో పాటు మాస్కులు పెట్టుకోవాలని లైసెన్సు బండి కాగితాలు లేకుండా వాహన ప్రయాణం చేయరాదని సూచించారు. గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని అలా ఏమైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు
Advertisement
తాజా వార్తలు
Advertisement