Sunday, May 19, 2024

TS : ఇవాళ మెద‌క్ జిల్లాలో కేసీఆర్ బ‌స్సు యాత్ర‌

ఇవాళ మెద‌క్ జిల్లాలో మాజీ కేసీఆర్ బ‌స్సు యాత్ర కొన‌సాగ‌నుంది. నేడు రాత్రి మెద‌క్‌లో నిర్వ‌హించే కార్న‌ర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

కేసీఆర్ రాక కోసం ఇప్పటికే స్థానిక నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. గులాబీ బాస్ బస్సు యాత్ర కోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు.మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకో రెండు నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్​లపై విమర్శలే ప్రత్యేక అస్త్రాలుగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పదేళ్ల పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయలేదని ఆరోపిస్తూ.. తెలంగాణలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement