Friday, May 24, 2024

ఇరుకుపాలెం రైతు భరోసా కేంద్రానికి తాళం

ముప్పాళ్ళ : సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం గ్రామంలో ఉన్న రైతుభరోసా కేంద్రానికి ఇంటి యజమాని బత్తుల రోశయ్య ఈరోజు తాళం వేశారు. గత సంవత్సర కాలం నుండి అద్దె చెల్లించడం లేదని అధికారులను అడిగితే సరైన సమాదానం ఇవ్వడం లేదని బత్తుల రోశయ్య వాపోయాడు. తనకు ఆరోగ్యం సరిగా లేక నడవలేని స్థితిలో ఉన్నానని అద్దె చెల్లించమని అధికారులను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నానని.. అయినా ఉపయోగం లేకపోవడంతో రైతు భరోసా కేంద్రానికి తాళం వేశానని రోశయ్య విలేకరులకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement