Saturday, May 4, 2024

ఎపిలో క‌బ‌డ్డీకి ప్రొత్సాహం – మంత్రి అవంతి..

అమరావతి, : రాష్ట్ర క్రీడల్లో కబడ్డీకి ప్రోత్సహం ఇవ్వాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువ జన, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, పురావస్తు శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికా రులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర క్రీడ కబడ్డీని మరింత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. ప్రధా నంగా క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టు-కోవడంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిం చారు. రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న క్రీడా ప్రాంగ ణాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. శాప్‌, ఎన్‌సిసి, యువజన సేవల విభాగాలు ఈ సంవత్సరంలో నిర్వహిం చబోయే కార్యక్రమాలు, నిధుల వినియోగంపై త్వరితగతిన ప్రణాళికలను తయారు చేయాలన్నారు. క్రీడలకు కేంద్ర సహా య ప్రాజెక్టుల ద్వారా విడుదలయ్యే నిధుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు ఇచ్చే పతకాలు, అవార్డుల నగదు విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
పర్యాటకంలో సంస్కరణలు
నూతన పర్యాటక పాలసీతో రాష్ట్రంలో అన్ని పర్యాటక ప్రాంతాలకు సరికొత్త శోభ సంతరించుకోనుందని మంత్రి ఆవంతి అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు అభివృద్ధి పనులను పరిశీలిచడం తో పాటు- పర్యాటక రంగానికి ఆదాయం వచ్చే మార్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా గండికోట ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ప్రత్యేక ప్రణాళి కలను రూపొంది స్తున్నట్లు- మంత్రి అవంతికి అధికారులు వెల్లడించారు. పెట్టు-బడి దారుల సహకారంపై సంబంధిత అధికారులు ఇప్పటికే చర్చలు జరిపిట్లు- వివరించారు. గండికోట పర్యాటక ప్రాంతంలో అధిక సంఖ్యలో పర్యాటక భూములు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేం దుకు పలువురు పెట్టు-బడి దారు లు ఆసక్తిచూపుతున్నారని చెప్పారు. అక్కడ అధునాతన సౌకర్యా ల తో రిక్రియేషన్‌ హోటళ్లు, ఎమ్యూజ్‌ మెం ట్‌ పార్క్‌, గోల్ఫ్‌ కోర్టులు, వంతెనల నిర్మాణా నికి రూపొం దిం చిన నివేదికను మంత్రికి అందజేశారు. సమీక్ష సమా వేశం లో పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ ల ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, క్రీడలు యువ జన సర్వీసుల సంక్షేమ శాఖల ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామ్‌ గోపాల్‌, పురావస్తు శాఖ కమీషనర్‌ వాణి మో హన్‌, క్రీడలశాఖ ఎం.డి రామారావు, సాంస్కృతిక శాఖ సీ ఈవో మల్లికార్జునరావు, శిల్పారామం సిీఈవో జయరాజు, యూత్‌ సర్వీసెస్‌ , ఎన్‌సిసి తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement