Thursday, May 9, 2024

ఖుష్బూ వ్యాఖ్యలు.. జనం నవ్వులు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానిక పార్టీలు, అభ్యర్థులు వారిపై హమీల వర్షం కురిపిస్తున్నాయి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీనటి ఖుష్బూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఖుష్బూ సొంత పార్టీ నేతపైనే నిప్పులు చెరిగారు. దీంతో పక్కనే ఉన్న ఆయన ఇబ్బంది పడ్డారు. ప్రచారంలో ఖుష్బూ మాట్లాడుతూ..  గత ఎమ్మెల్యే ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, పక్కనున్న ఓ నేత కాస్త చెప్పే ప్రయత్నం చేస్తున్న… ఇవేవీ పట్టించుకోని ఖుష్బూ మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ప్రజలనుంచి వస్తున్న స్పందనతో కుష్బూ మరింత రెచ్చిపోయి మాట్లాడారు. ఈ క్రమంలో వెనుక నుంచి ఓ నేత.. ‘మేడం.. ఆ మాజీ ఎమ్మెల్యే సెల్వం మీ పక్కనున్న ఆయనే’ అని ఖుష్బూ చెవుల్లో తెలియపరిచాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వున్న కేకే సెల్వం.. ఇటీవల డీఎంకే నుంచి బీజేపీలో చేరారు. ఆ విషయం తెలియని ఆమె యథాలాపంగా విమర్శలు కురిపించారు. దీంతో అక్కడున్న కార్యకర్తలంతా పెద్దగా నవ్వుతూ కేకలేశారు. ఖుష్బూకి ఏం చేయాలో పాలుపోలేదు.. ఆ సమయంలో కుష్బూ కాస్త ఇబ్బందిగా ప్రచారాన్ని ముందుకు కదిలించారు.

కాగా, బీజేపీ తరఫున థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నటి ఖుష్బూ సుందర్ కూడా తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే.. నియోజక వర్గంలో పుట్టే ప్రతి ఆడపిల్ల పేరుమీద లక్ష రూపాయలను డిపాజిట్ చేస్తానని ఇటీవలే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement