Saturday, May 25, 2024

రైతులకు గుడ్ న్యూస్‌.. రేపు అకౌంట్ల‌లోకి నేరుగా ఇన్ పుట్ సబ్సిడీ

గ‌తేడాది నవంబరులో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం నిర్ణయంచింది. ఈమేర‌కు సీఎం జగన్‌మోహ‌న్‌రెడ్డి రేపు రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ నిధులు జమ చేయనున్నారు.

మొత్తం రూ.534.77 కోట్లు విడుదల చేయనున్నట్టు స‌మాచారం. దీని ద్వారా 5.71 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. రేపు ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఒక్క బటన్ క్లిక్ తో రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాలను బదిలీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement