Wednesday, May 8, 2024

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ.. అర్ధరాత్రి అదను చూసి..

మంగళగిరి రూరల్ (ప్రభ న్యూస్): గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నగరపాలక సంస్థ పరిధి పెదవడ్లపూడిలో శనివారం అర్ధ‌రాత్రి ఓ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ జరగింది. గుర్తుతెలియని వ్యక్తి అదనుచూసి అప‌హ‌రించిన ఘ‌ట‌న జ‌రిగింది. ఆ వృద్ధురాలు గట్టిగా అరిచినా దగ్గర ఎవరూ లేకపోవడంతో దొంగ ఈజీగా తప్పించుకున్నట్టు తెలుస్తోంది. రూరల్ పోలీసులు వృద్ధురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాగా, నగరంలోని పట్టణ, రూరల్ స్టేషన్ల పరిధిలో నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో గస్తీని పెంచాల‌ని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా మిడ్‌నైట్‌ వేళల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ అమలు చేయాలని, అప్పుడే నేరాలకు అడ్డుక‌ట్ట వేయొచ్చ‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement