Saturday, April 27, 2024

అనంతపురంలో టెన్షన్.. విద్యార్థిని జయలక్ష్మి అదృశ్యం

అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడ్డ విద్యార్థిని జయలక్ష్మి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. విద్యార్థిని నిన్న రాత్రి నుంచి కనిపించకుండాపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. విద్యార్థిని అదృశ్యంపై పోలీసులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. విద్యార్థిని ఇంటి పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో స్పెషల్ పోలీసులు మోహరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డగిస్తున్నారు.

మరోవైపు ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీలో లాఠీ చార్జ్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలోకి తరలించినట్లు తెలుస్తోంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement