Sunday, May 19, 2024

ఐదు గృహాలు దగ్ధం

క‌ర్ల‌పాలెం: గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం పేరలి గ్రామం లో ఐదు గృహాలు దగ్ధమ‌య్యాయి. అందిన స‌మాచారం మేర‌కు గృహాల్లో ఉండే వారు రోజువారీ పనులు నిమిత్తం వెళ్లిపోయారు. ఆ ప్ర‌దేశంలో మంటలు రావడానికి ఎటువంటి అవకాశమూ లేద‌ని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కార‌ణంగానే మంటలు చెలరేగి ఐదు గృహాలు దగ్దమయిన‌ట్టు స్థానికులు తెలిపారు. అగ్ని ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన ఇత‌రులు అగ్నిమాపక శాఖ కు సమాచారం అందించారు. దీంతో ఆ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఐదు గృహాలు పూర్తిగా దగ్దమయ్యాయి, వాటిలోని బంగారం, గృహోపకరణాలు, దుస్తులు, టీవీ, రిక్షా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పూర్తిగా కాలి పోయి, కట్టు బట్టలతో తాము మిగిలామ‌ని బాధితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement