Sunday, May 19, 2024

ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థినులకు చంద్రబాబు పరామర్శ..

అమరావతి, ఆంధ్రప్రభ: చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థినులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయిన కారణంగా 36మంది హాస్టల్‌ విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని విద్యార్థినులకు సూచించారు.

హాస్టల్‌లో పరిస్థితులపై విద్యార్థులు చంద్రబాబుకు వివరించారు. ముందుగా 29 మంది విద్యార్థులు ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారని.. తరువాత మరో 7 గురు వైద్యం కోసం ఆసుపత్రిలో చేరారని చంద్రబాబుకు తెలిపారు. జరిగిన ఘటనకు భయపడి విద్యార్థులు మెస్‌లో ఆహారం కూడా తీసుకోవడం లేదని చంద్రబాబుకు వివరించారు. అందరూ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. వందల మంది విద్యార్థులు ఉండే హాస్టల్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement