Sunday, May 5, 2024

Fire Brand Police – మ‌హిళ సిఐ ఆగ్ర‌హం – జ‌న‌సేన నేత చెంప చెళ్లు..

శ్రీకాళహస్తి: ఓ మ‌హిళా సిఐకి కోపం వ‌చ్చింది.. సిఎం జ‌గ‌న్ దిష్టి బొమ్మ‌ను ద‌గ్డం చేస్తావా అంటూ జ‌న‌సేన నాయ‌కుడి చెంప చెళ్లు మ‌నిపించింది.. న‌డిరోడ్డుపై ఆ నేత‌కు చెంప దెబ్బ‌లు రుచి చూపింది..వివ‌రాల‌లోకి వెళితే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు.

అయితే దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని మహిళా సీఐ అంజు యాదవ్‌ వారికి తెలిపారు. ఆ తర్వాత దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జనసేన నేతలు పోలీసులను ఏమార్చి కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ చేయిచేసుకున్నారు. ఓ నేత రెండు చెంపలపైనా ఆమె కొట్టారు. ఆమె తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. న‌డిరోడ్డుపై త‌మ నేత‌పై చేయి చేసుకున్న సిఐని స‌స్సెండ్ చేయాల‌ని నినాదాలు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement