Sunday, May 19, 2024

Fire | తిరుమలలో అగ్ని ప్రమాదం.. ఆస్థాన మండపంలో చెలరేగిన మంటలు

పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇవ్వాల (ఆదివారం) అగ్నిప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో మంటలు చెలరేగాయి. ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశంలో ఉన్న మ్యాట్లకు నిప్పంటుకుంది. అక్కడున్న వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కొందరు అకతాయిలే మ్యాట్లకు నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement