Wednesday, May 8, 2024

Eluru: విద్యుత్ షాక్ తో ఫైబర్ నెట్ కార్మికుడి మృతి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా కల్వకుంటలో స్తంభంపై ఏపీ ఫైబర్ నెట్ వర్క్ చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి గోరికిపూడి వీరబాబు కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. గాయపడిన కార్మికుడిని ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నూజివీడుకు చెందిన వ్యక్తిగా సమాచారం. మృతుడితో ఉన్న తోటి కార్మికుల వద్ద నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement