Thursday, May 16, 2024

Breaking : పడవ మునక : ఇద్దరు గల్లంతు

ఓ ప‌డ‌వ నీటిలో మునిగిపోవ‌డంతో ఇద్ద‌రు గ‌ల్లంత‌మైన ఘ‌ట‌న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సీలేరు నదిలో ఈరోజు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుండి మ‌రో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ప‌డ‌వ‌లో ఎనిమిది మంది ఉన్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా వై.రామ‌వ‌రం మండలం డొంక‌రాయి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గల్లంతైన వారు వై.రామవరం మండలం మంగంపాడు గ్రామానికి చెందిన ఒకరు, టెలిక్యాంప్ గ్రామానికి చెందిన మరొకరుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement