Monday, May 6, 2024

AP | ఒకే స‌మ‌యంలో డీఎస్సీ, ఏపీ సెట్‌2 పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు

డీఎస్సీ జరగనున్న సమయంలోనే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోని డిప్యూటీ డీఈవో, ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ సెట్‌ పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 13న‌ డిప్యూటీ డీఈవో స్క్రీనింగ్ పరీక్ష కాగా, ఏప్రిల్ 28న ఏపీ సెట్ పరీక్ష జ‌ర‌గ‌నుంది. అదే సమయంలో స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలను ఏప్రిల్ 13 నుంచి 30 వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది.

చాలా మంది అభ్యర్థులు డీఎస్సీతో పాటు డిప్యూటీ డీఈవో, ఏపీ సెట్‌కు సిద్ధమవుతుంటారు. డీఎస్సీ పరీక్షల్లో మార్పులు చేసిన విద్యాశాఖ… ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రభుత్వం హడావుడిగా పరీక్షలను నిర్వహిస్తోందని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement