Thursday, May 16, 2024

త‌గ్గిన క‌రోనా : ఏపీలో కొత్త‌గా 434 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌తంలో వేల సంఖ్య‌లో న‌మోదైన కేసులు ఇప్పుడు వంద‌ల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నా యి. తాజాగా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 434 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,13,212 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరొకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 698 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,726 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 4636 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 22,83, 788 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 15, 193 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,28,46,978 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement