Sunday, May 12, 2024

Collision – లారీ బైక్ ఢీ – ఇద్ద‌రు విద్యార్ధులు దుర్మ‌ర‌ణం

చీరాల, జులై 11(ప్రభ న్యూస్ ): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మార్గం చెందారు.మంగళవారం ఈ సంఘటన చల్లారెడ్డిపాలెం బైపాస్ వద్ద చోటుచేసుకుంది. ఒంగోలు వైపు నుంచి చీరాల వైపు వస్తున్న కోళ్ల వ్యాను బాపట్ల నుంచి వేటపాలెం వస్తున్న ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు సూర్య తేజ (19)ఇమ్మిడిశెట్టి అజయ్ (19 ) గా పోలీస్ లు గుర్తించారు. మృతులు బాపట్లకు చెందిన సూర్య తేజ, దేశాయి పేటకు చెందిన అజయ్ లు. ఇద్దరికి డిప్లొమో పూర్తి అవటంతో సర్టిఫికెట్లు కోసం ఒక ప్రవేటు ఇంజినీరింగ్ కళాశాలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది.

కాగా, ఒంగోలు నుంచి చీరాల కు వస్తున్న క‌ర‌ణం వెంకటేష్ ప్రమాదం జరిగిన తీరుపై ఆయన చల్లించిపోయారు. వెంటనే 108 ఫోన్ చేసి ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ ను చీరాల ఏరియా వైద్యశాలకు తరలిo చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల తల్లి తండ్రులకు సమాచారం ఇప్పించారు. రూరల్ సీఐ మల్లికార్జునరావు,వేటపాలెం ఎస్ ఐ సురేష్, లు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement