Thursday, May 2, 2024

ర్యాగింగ్ రాంగ్ రూట్ లో వెళ్లొద్దు.. సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి

నిజామాబాద్, జులై (ప్రభ న్యూస్) 11: ర్యాగింగ్ అనే రాంగ్ రూట్ లో వెళ్తే ప్రమాదమే కాని ప్రయోజనం లేదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తెలిపారు. ఇవాల నిజామాబాద్ నగరంలోని ఎస్.ఎస్.ఆర్ కళాశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె విద్యార్థులను ద్దేశించి ప్రసంగించారు. విద్యనభ్యసించే సమయాల్లో ఇతరత్ర సమయాల్లో తోటి విద్యార్థులను వేధింపులకు గురిచేయడం చట్టరీత్యా నేరమన్నారు. మానసిక, శారీరక హింసకు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. పాఠాశాలలో, కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నతస్థాయికి ఎదగాలని ఉద్బోధించారు. ఒకవేళ ర్యాగింగ్ కు అలవాటు పడితే వారి భవిష్యత్ అంధకార బంధూరమేనని వివరించారు.

విద్యతో విజ్ఞానం సమపార్జించుకోవాలని, ఆ దిశగా విద్యార్థుల నడవడిక ఉండాలని ఆమె అన్నారు. పౌరుల దైనందిన జీవితం చట్టాలతో ముడిపడి ఉన్నదని, చట్టబద్ధంగా నడవడిక ఉండాలని సూచించారు. న్యాయసేవ సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ మాట్లాడుతూ… విద్య విద్యార్థులను విజ్ఞానవంతులను చేస్తే, ర్యాగింగ్ అధోగతి పాలుచేస్తుందని వివరించారు. ప్రతి విద్యార్థి చట్ట పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టపరిధిలో జీవన విధానం అలవర్చుకోవాలని వారు తెలిపారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్, విద్యార్థినీ, విద్యార్థులు, లెక్చరర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement