Tuesday, April 30, 2024

CM Ramesh: సినిమా టికెట్ రేట్లపై ఉన్న ఇంటరెస్ట్.. ప్రజా సమస్యలపై లేదు

ఏపీలో సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ రమేష్ మండిపడ్డారు. సినిమా రేట్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న ఇంటరెస్ట్.. ప్రజా సమస్యలపై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే.. హాళ్లను సీజ్ చేయిస్తారా..? అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంతున్నాయి..? అక్కడి విధానం ఏంటో ఓసారి చూడాలని సూచించారు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా ? అని సీఎం రమేష్ ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement