Monday, May 20, 2024

ప‌డ‌వ‌లో భారీగా చెల‌రేగిన మంట‌లు : 32 మంది సజీవ ద‌హ‌నం

ఓ మూడంత‌స్తుల‌ ప‌డ‌వ‌లో భారీగా మంట‌లు చెల‌రేగి.. 32మంది స‌జీవ ద‌హ‌న‌మైన విషాద ఘ‌ట‌న‌ బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని ఝకాకఠి ప్రాంతంలోని నదిలో ఈ తెల్లవారుజామున జరిగింది. ఇవాళ‌ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఢాకా నుంచి బరుంగా వెళ్తుండగా ప‌డ‌వ‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 మంది ఉన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వీరిలో చాలా మంది నదిలోకి దూకేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దాదాపు 100 మందిని బారిసాల్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. నదిలోకి దూకినవారిలో కొందరు నీటిలో మునిగిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. ఈప్ర‌మాదానికి సంబంధించి పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement