Saturday, April 27, 2024

ఏప్రిల్ 3న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం.. ఈ కార్యక్రమంపై ఏప్రిల్ 3వ తేదీన ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఏప్రిల్ 3వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సాయంత్రం మూడు గంటలకు ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు ముఖ్యమంత్రి. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికలకు సంబంధించి కేడర్ కు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ క్షేత్రస్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement