Friday, April 26, 2024

Big Breaking: పాలనా రాజధాని విశాఖ.. ప్రకటించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీఐఎస్ లో కీలక ప్రకటన చేశారు. పాలనా రాజధాని విశాఖ అని సీఎం జగన్ ప్రకటించారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతుందన్నారు. త్వరలోనే ఇది సాకారమవుతుందన్నారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు 340మంది ఇన్వెస్టర్లు వచ్చారన్నారు. రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. 6లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకం కానుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement