Friday, April 26, 2024

ఎమ్మెల్సీ అర్జునుడు పాడెమోసిన చంద్ర‌బాబు

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అంతిమ‌యాత్ర‌లో రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. మ‌చిలీప‌ట్నం చేరుకున్న చంద్ర‌బాబు బ‌చ్చుల కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి ఓదార్చాడు. బ‌చ్చుల అర్జునుడు మృతి కృష్ణా జిల్లాకే కాదు.. తెలుగుదేశం పార్టీకి తీరనిలోటన్నారు. అనంత‌రం సాగిన అంతిమ‌యాత్ర‌లో చంద్ర‌బాబు పాల్గొని పాడెమోశారు. ఈ అంతిమ‌యాత్ర బుట్టాయిపేట సెంటర్, కోనేరుసెంటర్, తోటవారితుళ్ల సెంటర్, రైల్వే స్టేషన్ మీదుగా బందరుకోటకు చేరుకోనుంది. బందరుకోటలో అర్జునుడు అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement