Saturday, April 20, 2024

కంచర్ల శ్రీకాంత్ గెలిపే లక్ష్యంగా అడుగులు

వరికుంటపాడు : ఈనెల 13న జరగనున్నటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అడుగులు ముందుకు వేయాలని టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు సూచించారు. వరికుంటపాడు మండల పరిధిలోని మహమ్మదాపురం, గొల్లపల్లి తదితర గ్రామాలలో గ్రాడ్యుయేట్ల ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని, న్యాయం జరగాలంటే శ్రీకాంత్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ చండ్రా వెంకయ్య, క్లస్టర్ ఇంచార్జ్ పోకా మహేష్, చండ్రా ప్రభాకర్, పూర్ణచంద్రరావు, ఆరికొండ వెంకటరత్నం, శివరామయ్య టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement