Wednesday, May 8, 2024

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాతం, అభిషేక సేవలో పాల్గొన్నారు. సీజేఐతోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ కూడా శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు ఆలయ అధికారులు స్వామివారి శేశ వస్త్రాన్ని బహూకరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement