Tuesday, April 30, 2024

హామీలన్నీ నెరవేరుస్తున్నాం : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక 20 డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటముని రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మెల్యే కర్ణాకర్ రెడ్డి ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. మూడేళ్లలో పథకాల ద్వారా ఆయా కుటుంబాలు పొందిన లబ్ధిని ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంటి ముంగిటికే అందుతున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల ఆదరభిమానాలు వారి ఆశీస్సులే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొండంత బలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ. కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు. సంధ్య. టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు మబ్బు నా ద ముని రెడ్డి. బ్రహ్మానంద రెడ్డి.. వైఎస్ఆర్సిపి నాయకులు తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement