Wednesday, May 8, 2024

తిరుపతి టౌన్ బ్యాంక్ లో పారదర్శక పాలన : ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేసి, గెలిపించాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అభ్యర్థించారు. స్థానిక పెద్దకాపు వీధి,చిన్న కాపు వీధి, కాగితాల వీధి ప్రాంతాల్లో ఈ ఉదయం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈనెల 20వతేదీ జరగనున్న టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుతాయని భరోసా ఇచ్చారు. అవినీతికి అవకాశం లేకుండా పారదర్శక పాలన అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థులు కేతం జయ చంద్రారెడ్డి, రేమాల బ్రహ్మానందరెడ్డి, అనిల్ రాయల్, కాశీం, అమర నాద రెడ్డి, మాకం చంద్రయ్య, వాసు దేవ యాదవ్, పోలిరెడ్డి నాగిరెడ్డి, మబ్బు నాధముని రెడ్డి, వెంకటేష్ రాయల్, వేమూరి జ్యోతి ప్రకాష్, సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement